కేంద్రం ఇంకా రూ.4వేల కోట్లు ఇవ్వాలి : బాబు

SMTV Desk 2019-01-29 17:26:19  polavaram, chandrababu, tdp, anatapuram

అనంతపురం, జనవరి 29: ఈరోజు అనంతపురం జిల్లాలోని కియా మోటార్ సంస్థల తోలి కారు విడుదల చేసిన ఏపీ సీఎం చంద్రబాబు.. అనంతరం జిల్లాలోని చెర్లోపల్లి రిజర్వాయర్ నుండి చిత్తూరు జిల్లాకు నీటిని విడుదలచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇంకా రూ.4 వేల కోట్లు ఇవ్వాల్సిఉందని ఆ నిధులు ఇవ్వకుండా కేంద్రం ఇబ్బంది పెడుతోందన్నారు. నదుల అనుసంధానాన్ని చేసి చూపిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని బాబు చెప్పారు. కృష్ణా, గోదావరి నదులను పట్టిసీమ ద్వారా అనుసంధించినట్టు బాబు గుర్తు చేశారు.

ఇక పోలవరం ప్రాజెక్టును కూడా ఈ ఏడాది మే నాటికి పూర్తి చేస్తామన్నారు. పోలవరానికి గ్రావిటీ ద్వారా నీరందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా కృష్ణాడెల్టాకు వాడుకొనే నీటిని శ్రీశైలంలో నిల్వ ఉంచి రాయలసీమకు నీటిని అందిస్తున్నట్టు బాబు చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ కూడ నీటి సమస్య తలెత్తకుండా ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. సాగు నీటి సమస్య లేదని వరి పంట వేయకూడదన్నారు. అనంతపురంలో ఎక్కువగా పండ్లతోటలు వేయడం వల్ల రైతులు అత్యధికంగా ఆదాయాన్ని పొందుతున్నారన్నారు. డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలను ఇస్తున్నట్లు బాబు చెప్పారు. తెలంగాణలో ఆదాయం ఎక్కువగా జనాభా తక్కువగా ఉందని చెప్పారు. తెలంగాణ, తమిళనాడుతో పాటు ఏ రాష్ట్రాల్లో ఇవ్వకున్నా ఏపీలో మాత్రమే డ్వాక్రా సంఘాలకు నిధులను ఇచ్చినట్టు చంద్రబాబు చెప్పారు.