గోవా సీఎంని కలిసిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు

SMTV Desk 2019-01-29 15:53:39  Rahul Gandhi, Manohar Parikar, Rafale deal files, Narendra Modi

పానాజీ, జనవరి 29: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మంగళవారం ఉదయం గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ను కలిశారు. గోవా పర్యటిస్తునలో ఉన్న రాహుల్‌ విధానసభ పరిసరాల్లో పారికర్ తో సమవేశం అయ్యారు. పారికర్‌ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు రాహుల్‌ పారికర్‌ను కలిసినట్లు కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. "ఈ ఉదయం గోవా ముఖ్యమంత్రి పారికర్ ను కలుసుకున్నాను. అనారోగ్యం నుంచి ఆయన తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన. ఈ మధ్యాహ్నం కేరళ పోలింగ్ బూత్ కమిటీ సభ్యులతో నేను మాట్లాడబోతున్నా. దీనికి సంబంధించి నా ఫేస్ బుక్ పేజ్ లో లైవ్ చూడవచ్చు" అని రాహుల్‌ గాంధీ ట్వీట్ చేశారు. అయితే, రఫేల్‌ వొప్పందానికి సంబంధించిన ఫైల్‌ పారికర్‌ వద్ద ఉంది కాబట్టే ప్రధాని మోదిపై పైచేయి సాధించి గోవా సిఎంగా కొనసాగుతున్నారు అని రాహుల్‌ సోమవారం ట్విట్టర్‌ వేదికగా ధ్వజమెత్తారు.