కివీస్ పై విజృంభించిన మిథాలి సేన

SMTV Desk 2019-01-29 15:50:57  India VS Newzeland, ODI Womens, Mithali sena

న్యూజిలాండ్‌/మౌంట్ మాంగనుయ్, జనవరి 29: న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో మౌంట్ మాంగనుయ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని భారత్ అలవోకగా చేధించింది. స్మృతీ మంథాన 90, మిథాలీ రాజ్ 63 పరుగులు చేసి టీమిండియాను విజయ తీరాలకు చేర్చారు.





అంతకు ముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌.. భారత బౌలర్ల ముందు నిలబడలేకపోయింది. గోస్వామి 3, బిషిత్ 2, డీబీ శర్మ 2, పూనమ్ యాదవ్ 2 వికెట్లు తీసి కీవీస్‌ను దెబ్బ తీశారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో గెలుచుకుంది.