ప్రచార రథాలు ప్రారంభించిన జనసేనాని..

SMTV Desk 2019-01-28 19:40:34  Pavan kalyan, Janasena, AP, prachara radham

మంగళగిరి, జనవరి 28: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు ప్రచార జోరు పెంచాయి. దీనిలో భాగంగా జనసేన పార్టీ ప్రచార రధాలని ఏర్పాటు చేసింది. ఈ ప్రచార రథాలని ఈరోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ప్రకటనల కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేయకుండా... తక్కువ ఖర్చుతోనే ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లేలా కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇందులో భాగంగా ప్రచార రథాలను సిద్ధం చేసారు.

ఇక ఈ రధాలపైన పార్టీ సిద్ధాంతాలు, అధికారంలోకి వచ్చాక చేపట్టబోయే పథకాలను ముద్రించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో కొత్తగా నిర్మించిన జనసేన కార్యాలయంలో ప్రచార రథాలను పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అద్భుతంగా రథాలను సిద్ధం చేసిన జనసైనికులను పవన్ అభినందించారు. ఇక రేపటి నుంచి ఈ ప్రచార రథాలు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నాయి.