కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుసగా వివాదాలకు కారణమవుతున్నారు.సిద్ధరామయ్య ఓ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించారు. అందరి ముందు ఓ మహిళ చున్నీని (దుపట్ట)ను లాగారు. ఇది రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇలా ప్రవర్తించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సంఘటన కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపింది. వొక వైపు ఏఐసీసీ అధ్యక్షుడు మహిళా స్త్రీ సాధికారత గురించి మాట్లాడుతుంటే వొక మాజీ ముఖ్యమంత్రి మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడంపై ప్రతిపక్షాలు విమర్శించాయి.
#WATCH Former Karnataka Chief Minister and Congress leader Siddaramaiah misbehaves with a woman at a public meeting in Mysuru. #Karnataka pic.twitter.com/MhQvUHIc3x
— ANI (@ANI) January 28, 2019