హైదరాబాద్, జనవరి 28: దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయన కుమారుడు హితేష్ వైసీపీలో చేరటంపై కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో కీలక నేతగా ఉంటున్న దగ్గుబాటి పురంధేశ్వరి ... ఆమె భర్త, కుమారుడు లను వైసీపీలో చేర్పించడం సిగ్గుచేటని అన్నారు. పద్మశ్రీ మాట్లాడుతూ.. బీజేపీ, వైసీపీల తెరచాటు భాగోతం వైసీపీలో దగ్గుబాటి చేరికతో బహిర్గతమైందని చెప్పారు. పద్మశ్రీ వ్యాఖ్యలపై దగ్గుబాటి కుటుంబం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇక వైసీపీలో దగ్గుబాటి చేరికను ఆ పార్టీ శ్రేణులు కూడా వ్యతిరేకిస్తున్నారు.