ముంబై, జనవరి 28: మహారాష్ట్ర బీజేపీ నాయకురాలు సరోజ్ పాండే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ‘జోకర్ గా అభివర్ణించారు. మహారాష్ట్రలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రియాంక గాంధీతో పాటు తన పిల్లలని, భర్తని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొస్తుందన్నారు. ప్రియాంక గాంధీని ట్రంప్ కార్డ్గా కాంగ్రెస్ నాయకులు వర్ణించడంపై ఆమె స్పందిస్తూ.. ‘ప్రియాంక అంత గొప్ప నాయకురాలు అయితే ముందే ఆమెను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాల్సింది. ఎందుకు ఇంతకాలం సమయం వృథా చేసి జోకర్తోనే ఆట కొనసాగించార ని రాహుల్ గాంధీని పరోక్షంగా ఎద్దేవా చేశారు.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత వొకరు ప్రియాంక గాంధీ లాంటి అందమైన మహిళ తమ పార్టీలో ఉన్నారని చేసిన వ్యాఖ్యలపై ఆమె మాట్లాడుతూ... ‘ప్రియాంక గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్న తీరుకు ఈ వ్యాఖ్యలే నిదర్శనం అని.. మహిళల అందం గురించే వారు ఆలోచిస్తున్నార ని విమర్శించారు. ఇప్పటికే భూ కుంభకోణాల్లోఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రాను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని ఆయనకు కోశాధికారి పదవి అప్పగించాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.