అమరావతి, జనవరి 28: ప్రముఖ ఆర్థికవేత్త, పర్యావరణ ఉద్యమకారుడు పెంటపాటి పుల్లరావుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంశలు కురిపించారు. పెంటపాటిని జనసేన పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించినట్లు తెలిపారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయలాపై ఆయన రాస్తున్న కథనాలు విషయాపూరితంగా ఆలోచించేవిదంగా ఉన్నాయని పేర్కొన్నారు.
వొక సందర్భంలో తాను పుల్లారావుని కలుసుకున్నాననీ, ఇద్దరం కొంత సమయం పాటు వొకరి ఆలోచనలను మరొకరం పంచుకున్నామని వెల్లడించారు. అనుభవం కలిగిన పుల్లారావు లాంటి వ్యక్తుల మార్గదర్శకత్వం జనసేన లాంటి కొత్త పార్టీకి ఎంతైనా అవసరమన్నారు. జనసేన పార్టీలో చేరాల్సిందిగా పెంటపాటిని వొప్పించానని, ఆయన రాకకోసం ఎదురుచూస్తున్నానని పవన్ వ్యాఖ్యానించారు.
ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన పవన్ కల్యాణ్.. జనసేన విధానాలపై పుల్లారావు రాసిన ఓ వార్తా కథనం క్లిప్ ను ట్వీట్ కు జతచేశారు.