జనసేన రథాలు రెడీ

SMTV Desk 2019-01-28 15:37:38  Pawan Kalyan, Campaign charts, Janasena

అమరావతి, జనవరి 28: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల నేపథ్యం లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త వొరవడి సృష్టించనున్నారు . జనసేన పార్టీ భారీ గా ధనాన్ని ప్రకటనల పరంగా వృధా చేయకుండా పార్టీ సిదంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ నేతలు ప్రచార రథాలను సిద్ధం చేశారు. ఆ ప్రచార వాహనాల పై జనసేన కి సంబందించిన సిద్ధాంతాలు, అధికారం అప్పగిస్తే చేపట్టబోయే పథకాల వివరాలను ముద్రించారు. ఈ రోజు జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ ప్రచార రథాలను విజయవాడలో ప్రారంభించనున్నారు. తక్కువ వ్యయంతో ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు వీలుగా ఈ వాహనాలను రూపొందించారు. తక్కువ వ్యయం తో ప్రజల్లో ఎక్కువ ఆకర్షితమయ్యేలా దీన్ని తీర్చిదిద్దారు