హైదరాబాద్, జనవరి 27: తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముచ్చటించారు. రిపబ్లిక్ డే సందర్భంగా శనివారం సాయంత్రం రాజ్భవన్లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ప్రముఖులకు తేనేటి విందు ఇచ్చారు. ఈ విందులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.
సీఎం కేసీఆర్ పక్కనే పవన్ కల్యాణ్ కూర్చున్నారు. మరోవైపు కేటీఆర్.. కూడా పవన్ పక్కనే ఉన్నారు. అటు సీఎం.. ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దరూ కాసేపు పలు విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీలో గత కొద్దిరోజులుగా జరిగిన రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. ఇలా కేటీఆర్తో.. కేసీఆర్ ఇద్దరితో సుమారు అరగంటకు పైగా పవన్ చర్చించినట్లు తెలుస్తోంది.
పవన్ ఈ కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. కాగా ఇటీవలే కేటీఆర్- వైసీపీ అధినేత వైఎస్ జగన్ భేటీపై పవన్ కల్యాణ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ విందుకు మాజీ సీఎం రోశయ్య, ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, స్వామిగౌడ్, స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, హోం మంత్రి మహమూద్ అలీ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.