బాబాయి ఎలా ఉంటాడో చెప్పే పాట

SMTV Desk 2019-01-26 13:51:15  Janasena, Okadochadu, Ram charan

జనసేన పార్టీకి సంబంధించిన ‘వొకడొచ్చాడు.. అనే పాటను గణతంత్ర దినోత్సవం సందర్భంగా..మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ విడుదల చేశారు. దేశం కోసం పోరాడిన హీరోలకు ఈ పాటను అంకితం చేస్తున్నట్లు చరణ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు తన అధికారక ఫేస్‌బుక్‌అకౌంట్ లో ఓ పోస్ట్‌ చేశారు. 69వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పాటను దేశం కోసం పోరాడిన హీరోలకు అంకితం చేస్తున్నా. నా దృష్టిలో, లక్షలాది అభిమానుల దృష్టిలో, అంతకన్నా ఎక్కువ ఉండే జనసైనికుల దృష్టిలో బాబాయి ఎలా ఉంటాడో చెప్పే ఓ పాట ఇది.. దీన్ని విని స్ఫూర్తి పొందండి. జై హింద్‌ అని చరణ్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.

‘వొకడొచ్చాడు.. వచ్చాడు.. జాతిని జాగృతిగొలుప.. అని సాగే ఈ పాటకు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. చరణ్ ఇప్పటికే అనేక సందర్భాల్లో తన బాబాయికి మద్దతు తెలిపారు. పవన్‌ అడిగితే ఏం చేయడానికైనా కుటుంబం సిద్ధంగా ఉందని చెప్పారు.