బెంగళూరు, జనవరి 26 : భారతదేశ గర్వించదగిన ,మహోన్నతమైన వ్యక్తి మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధకృష్ణ.. ఈయన మనవడు సుబ్రమణ్యం శర్మ(44) నేడు బీజేపీలో తీర్థం పుచ్చుకోనున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యురప్ప సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న సంక్షోభాలూ, అసమానతలను తొలగించే ఉద్దేశంతో తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు సుబ్రమణ్యం ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సమాజంలో పేద, ధనిక వర్గాల మధ్య అంతారాలు విపరీతంగా పెరిగిపోయాయి. వ్యవస్థలో ఉన్న వ్యక్తుల్లో ఎవరో వొకరు దీన్ని తొలగించడానికి పూనుకోవాలి. ఈ అసమానతలను తొలగించడమే ధ్యేయంగా నేను రాజకీయాల్లోకి వచ్చాన ని ఈ సందర్భంలో ప్రకటించారు. ఇంతకుమునుపు ఆయన 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ‘మహిళా ఎంపవర్మెంట్ పార్టీ తరఫున మల్లేశ్వరం నియోజకవర్గం నుంచి సుబ్రమణ్యం పోటీ చేశారు.