జగన్ పై అతను కావాలనే దాడి చేశాడా?

SMTV Desk 2019-01-25 12:15:51  YS Jagan mohan reddy, Chandrababu, Jagan attempt to murder, High court, NIA

విజయవాడ, జనవరి 25: ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు ఎన్ఐఏ కస్టడీ ముగిసింది. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావును అధికారులు ఈరోజు విజయవాడలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. జగన్ పై అతను కావాలనే దాడి చేశాడా? లేక ఈ దాడి వెనుక మరెవరైనా ఉన్నారా? అన్న విషయంలో ఈరోజు స్పష్టత రానుంది.

గత సంవత్సరం అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు కోడికత్తితో వైఎస్ జగన్ పై దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో జగన్ ఎడమ చేతికి లోతైన గాయం కావడంతో ఆయన హైదరాబాద్ లో శస్త్రచికిత్స చేయించుకున్నారు.