పట్నం నరేందర్ పై హై కోర్ట్ లో పిటిషన్ దాఖలు ??

SMTV Desk 2019-01-24 13:51:53  Revanth reddy, TCongress,congress working president,TRS,patnam narendar reddy,kodangal

హైదరాబాద్, జనవరి 24: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలుకావడంతో మీడియా కి దూరం గా వున్నారు ఎక్కడ వొక్కసారి అయినా కనిపించలేదు ఆ మధ్య డీకే అరుణ ఇచ్చిన విందులో మెరిశారు తర్వాత ఇన్నాళ్టికి మళ్ళి కనిపించారు . వివరాల్లోకి వెళ్తే రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ప్రస్తుత కొడంగల్ ఎమ్మెల్యేగా తెరాస నుండి గెలుపొందిన పట్నం నరేందర్ రెడ్డి నిబంధనలను ఉల్లంఘించారని పిటిషన్ దాఖలు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలనీ, అనర్హుడిగా ప్రకటించాలని కోర్టుకు కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ పై పోటీచేసిన పట్నం నరేందర్ రెడ్డి 10,770 ఓట్ల మెజారిటీతో రేవంత్ పై విజయం సాధించిన సంగతి తెలిసిందే.