గురుగ్రామ్, జనవరి 24: హర్యానాలోని గురుగ్రామ్ పట్టణంలో పెద్ద ప్రమాదం సంభవించింది. నిర్మాణ దశలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. నగరంలోని సైబర్హౌజ్కు 12 కిలోమీటర్ల దూరంలో గల ఉల్లవాస్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనలో ఎనిమిది మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన రక్షణ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.