సముద్రంలో చెలరేగిన మంటలు..

SMTV Desk 2019-01-23 19:39:10  Russia, ships, Fire Accident

మాస్కో, జనవరి 23: నడి సముద్రంలో క్యాండీ, మేస్ట్రో అనే రెండు నౌకలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. లిబయాన్‌, టర్కిష్‌, భారత్‌ సిబ్బందితో వెళ్తున్న రెండు నౌకలు నడి సంద్రంలో అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు 11 మంది మరణించిగా.. 9 మంది గల్లైంతనట్లు రష్యా న్యూస్ ఏజెన్సీ వర్గాలు వెల్లడించాయి. అయితే మృతుల్లో భారతీయులు ఉన్నారా లేరా అనే విషయం ఇంకా తెలియలేదు. రష్యా నుంచి క్రిమియా ద్వీపకల్పాన్ని వేరు చేసే కెర్చ్‌ జలసంధి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. రెండు షిప్పుల్లో వొకటి సహజవాయువును తీసుకెళ్తుండగా.. మరొకటి ట్యాంకర్‌ నౌక అని తెలిసింది. వొక నౌక నుంచి మరొక నౌకలోకి ఇంధనం మార్చుతుండగా వొక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు.

అయితే ప్రమాదానికి గురైన క్యాండీ అనే షిప్పులో 17 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 8 మంది భారతీయులు.. 9మంది టర్కీ పౌరులు ఉన్నారు. మరో నౌక మేస్ట్రోలో 15 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో ఏడుగురు భారతీయులు, 7గురు టర్కీ పౌరులు కాగా మరోకరు లిబియాకు చెందిన వారని రష్యా అధికారులు తెలిపారు. వొక నౌకలో పేలుడు సంభవించటంతో చెలరేగిన మంటలు మరో షిప్పుకు అంటుకున్నాయని పేర్కొన్నారు. మంటలు వ్యాపించగానే రెండు నౌకల్లోని మొత్తం 32 మంది సిబ్బంది సముద్రంలోకి దూకారని, వారిలో ఇప్పటి వరకూ 12 మందిని సహాయక సిబ్బంది రక్షించి తీరానికి చేర్చారని వెల్లడించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని అధికారులు వెల్లడించారు.