ముంబై, జూలై 31: రోజుకో ఆఫర్తో టెలికాం రంగాన్ని కుదిపేస్తున్న జియో సంస్థ ఇటీవల ఉచితంగా 4జీ ఫోన్ ఇస్తామని వెల్లడించారు. అయితే దీని కోసం రూ. 1500 చెల్లించాలని, మూడేళ్ల తరువాత ఆ డబ్బు వెనక్కు తిరిగిచ్చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మరో ప్రధాన టెలికం సంస్థ ఎయిర్టెల్, జియో ధరకంటే తక్కువకే 4జీ ఫీచర్ ఫోన్ అందించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిర్టెల్ ఫోన్ ధర రూ. 1000 ఉంటుందని సమాచారం. అయితే జియో సంస్థలాగా ఈ మొత్తాన్ని కొన్నేళ్ళ తరువాత తిరిగి ఇస్తారా? లేదా? అన్న విషయంపై స్పష్టత రావాల్సివుంది. జియో పోటీని తట్టుకోవాలంటే ఇలాంటి కొత్త ఆఫర్లతో వినియోగదారులకు మరింత చేరువయ్యే ప్రయత్నంలో ఎయిర్ టెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు టెలికం వర్గాలు తెలిపాయి.