నేపియర్, జనవరి 23: భారత్-న్యూజిలాండ్ తో ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో నేడు జరిగిన తొలి వన్డేలో భారత్ విజయ భేరిని మ్రోగించిన విషయం తెలిసిందే. ఈ విజయం భారత ఆటగాళ్లలో మరింత ఆత్మవిశ్వాసం నింపింది. దీంతో ఆటగాళ్లు ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత వైదానంలో గెలుపు సంబరాలను విచిత్రంగా చేసుకున్నారు. భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ధోనీలు మ్యాచ్ తర్వాత మైదానంలో సరదాగా గడిపిన వీడియోను బిసిసిఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
వీరిద్దరు టూ వీల్స్ సెల్ప్ బ్యాలెన్స్ కార్ పై గ్రౌండ్ లో చక్కర్లు కొట్టారు. మొదట వాహన ప్రియుడైన ధోని ఈ రైడింగ్ మొదలుపెట్టగా ఆ తర్వాత కోహ్లీ దానిపై చక్కర్లు కొట్టాడు. అయితే ధోని కాన్పిడెంట్ గా ఆ వాహనాన్ని హ్యాండిల్ చేయగా...కోహ్లీ మాత్రం కాస్త తడబడుతూనే రైడ్ పూర్తి చేశాడు. ఇలా గెలుపు ఆనందంలో ఆటగాళ్లు మైదానంలోనే కాస్సేపు సరదాగా గడిపారు.
Post-game shenanigans courtesy @msdhoni & @imVkohli
— BCCI (@BCCI) January 23, 2019
This looks fun 😁😁😁#TeamIndia #NZvIND pic.twitter.com/0EXXHYh2v7