హైదరాబాద్, జనవరి 23: రామ్ హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. కాగా ఈరోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ చిత్రానికికి పూరి దర్శకుడిగానే కాకుండా .. నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి హీరోయిన్ చార్మీ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ సినిమాలో రామ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు.
ఇటీవల కాలంలో రామ్ కి సరైన హిట్ పడలేదు. దీంతో ఆయనతో పాటు అభిమానులు కూడా నిరాశలో వున్నారు. ఇక పూరి కూడా హిట్ కొట్టి, చాలా కాలమే అయింది. దాంతో ఈ సారి తప్పకుండా సక్సెస్ ను పట్టుకోవాలనే పట్టుదలతో ఆయన వున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా సెట్ అయింది. పూరి మార్క్ మాస్ కంటెంట్ తోనే ఈ సినిమా రూపొందనుందనే విషయం టైటిల్ ను బట్టే తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబందించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.
#iSmartShankar Movie Launched Today!!
— Telugu FilmNagar (@telugufilmnagar) January 23, 2019
Regular shooting from tomorrow.
Hyderabadi Mass Masala Entertainer on the way 😎#RaPo17 #Puri35 #PCFilm @ramsayz @purijagan @Charmmeofficial pic.twitter.com/xZ8bsi7Fex