పశ్చిమ బెంగాల్‌లో అమిత్‌ షా ర్యాలీ..

SMTV Desk 2019-01-22 18:29:27  amithsha, West Bengal, rally, BJP, Trinamoool Congress

కలకత్తా, జనవరి 22: రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచార కార్యక్రమాలు వేగవంతం చేసాయి. తాజాగా జరిగిన పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ మెగా ర్యాలీ తరహాలో ఈరోజు పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా ర్యాలీ నిర్వహించారు. అమిత్ షా అనారోగ్య పరిస్థితి నుంచి కోలుకున్న తరువాత మొదటిసారి ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ ర్యాలీలో పశ్చిమ బెంగాల్‌కి చెందిన బీజేపీ నేతలతో పాటు పలువురు ముఖ్య నాయకులు హాజరు అయ్యారు. కాగా, మొదట మాల్దా ఎయిర్‌పోర్ట్‌ హెలిప్యాడ్‌లో అమిత్‌ షా విమానం ల్యాండయ్యేందుకు మమత ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో బీజేపీ నాయకులు తృణమూల్‌ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. అయితే ఎయిర్‌పోర్ట్‌కి బదులు మాల్ధా జిల్లాలో బీఎస్‌ఎఫ్‌ ఉపయోగించే హెలిప్యాడ్‌లో అనుమతించడంతో బీజేపీ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి.