విజయవాడ, జనవరి 21: సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ రూపకల్పన ఆర్ధికశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కాగా రేపటి నుండి వరుసగా నాలుగు రోజులపాటు ఆయా శాఖల అధికారులతో ఫ్రీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు.
వాటి వివరాలు తేదీల వారిగా 22న పౌరసరఫరాలు, వ్యవసాయం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా శిశు సంక్షేమం, 23న పరిశ్రమలు, విద్యుత్, రెవిన్యూ, హోం, మున్సిపల్, అటవీశాఖ అధికారులతో మంత్రి సమావేశమవుతారు. 24న మానవవనరులు, పంచాయతీరాజ్, ఆర్అడ్బీ, ఆరోగ్యం, ఇరిగేషన్, 25న ఐటీ, సమాచార, ప్రణాళిక, పర్యాటక శాఖల అధికారులతో యనమల సమావేశాలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు.