కేరళ, జనవరి 21: సుప్రీం కోర్టు శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసిన దగ్గరనుంచి కేరళ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య రెండునెలల పాటు కొనసాగిన శబరిమల వార్షిక పూజలు ఆదివారంతో ముగిశాయి. అన్ని వయసుల మహిళలను ఆలయంలోకి అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ శ్రేణుల నిరసనలు, ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికిపోయింది.
67 దినముల అయ్యప్ప వార్షిక పూజల అనంతరం ఆదివారం ఉదయం 6.15 గంటలకు పండాలం రాజకుటుంబానికి చెందిన పి.రాఘవ వర్మ రాజా దర్శనం అనంతరం భస్మాభిషేకం పూజతో ఆలయ మహద్వారాన్ని మూసివేశారు. కాగా మళ్ళి ఫిబ్రవరి 13వ తేదీన మళయాళం నెల కుంభం సందర్భంగా పూజల కోసం ఆలయాన్ని తెరుస్తారు.