అమరావతి, జనవరి 20: ప్రముఖ హాస్యనటుడు అలీ ఈ రోజు ఉదయం ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. సినీ నటుడు అలీ వైసీపీ, జనసేనలో చేరుతారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. అయితే వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ను రైల్వే స్టేషన్లో కలిశానని అలీ ప్రకటించారు. జగన్ను కలిసిన కొన్ని రోజులకే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్తో పవన్ కళ్యాణ్ను కలిశారు. పవన్ కళ్యాణ్ను కలిసి రోజునే ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కూడ అలీ కలిశారు. ఆదివారం నాడు సినీ నటుడు అలీ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో చర్చించారు. అలీ టీడీపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.
ఇదే అభిప్రాయాన్ని కూడ జనసేన నేతలు కూడ చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలోనే అలీని గుంటూరు సిటీ నుండి టీడీపీ బరిలోకి దింపాలని భావించింది. మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి అలీతో చర్చించారు. కానీ, ఆ సమయంలో పోటీకి ఆయన దూరంగా ఉన్నారు. కానీ, వచ్చే ఎన్నికల సమయంలో అలీ పోటీకి ఆసక్తిగా ఉన్నారని అంటున్నారు. అయితే అలీ ఏ పార్టీలో చేరుతారో ఇంకా స్పష్టం కావాల్సి ఉంది.