కేసీఆర్ కు జగన్ బహిరంగ లేఖ

SMTV Desk 2019-01-19 19:19:46  YSRCP, KCR, TRS, YS Jagan mohan reddy, Jagan wrote a letter to kcr

అమరావతి, జనవరి 19: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి తాజాగా ఓ బహిరంగ లేఖ రాశారు. అంతర్రాష్ట్ర ఉద్యోగుల బదిలీల అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని లేఖలో కోరారు.

అంతర్రాష్ట్ర బదిలీలను సత్వరమే పూర్తి చేయాలని కేసీఆర్‌ను జగన్ కోరారు. మానవతా దృక్పథంతో ఆలోచించి బదిలీలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పరస్పర బదిలీలపై కమిటీ సవరణ ఉత్తర్వులు విడుదల చేయాలని వైఎస్ జగన్‌ తన లేఖలో కోరారు.