న్యూ ఢిల్లీ, జనవరి 19: ధోని పని అయిపొయింది అంటూ వచ్చిన విమర్శలపై మహేంద్ర సింగ్ ధోని తనదైన శైలిలో వారికి సమాధానమిచ్చారు. వొకటి కాదు రెండు కాదు వరుసగా మూడు మ్యాచ్ లలో అర్ధ సెంచరీలు చేసి వారికి సరైన జవాబిచ్చాడు ధోని. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో అద్భుతమైన ఆటతీరుతో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్ను 2–1తో గెలుచుకొని కోహ్లి బృందం సత్తాను చాటింది. దీంతో ఆస్ట్రేలియా గడ్డపై చరిత్ర సృష్టించిన టీం ఇండియా పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
తాజాగా.. టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సతీమణి సాక్షి ధోనీ సోషల్ మీడయాలో అభినందనలు తెలిపారు. టీం ఇండియా చారిత్రాత్మక విజయాన్ని సాధించారని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆమె టీం ఇండియాకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మ్యాచ్ గెలిచి దేశం గర్వపడేలా చేశారని ఆమె పేర్కొన్నారు. సైనికుల్లా కష్టపడి విజయం సాధించారంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పోస్ట్ చేశారు.
FIFTY!@msdhoni in 2019
— BCCI (@BCCI) January 18, 2019
Matches: 3 ✔️
50s: 3✔️
Average: 150 plus✔️#AUSvIND #TeamIndia pic.twitter.com/uyJQAvmKe7
Another Trophy in the cabinet. 2-1 🇮🇳🇮🇳
— BCCI (@BCCI) January 18, 2019
Jai Hind #TeamIndia #AUSvIND pic.twitter.com/oq101deoed