బెంగుళూర్, జనవరి 19: విలక్షణ నటుడు ప్రకాశ్రాజ్ రాబోయే లోక్సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలోనూ నిజాయితీ, నిబద్దత లేదని అందువల్ల ఏ పార్టీలోనూ చేరే ఆలోచన లేదన్నారు. తాను బెంగళూరులోని మార్థాస్ ఆస్పత్రిలో జన్మించానని, చామరాజపేట, శాంతినగరలలో కొన్నాళ్లు నివాసం ఉన్నానని చెప్పారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘జస్ట్ ఆస్కింగ్ ద్వారా తాను అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాలేదన్నారు. పార్లమెంట్లోకి అడుగు పెట్టిన నేతలు.. ప్రజా సమస్యలపై గళం విప్పకుండా ఎవరో వొకరి చెప్పుచేతల్లో ఉండిపోతున్నారని విమర్శించారు. త్వరలోనే తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తానన్నారు