ఆసిస్ గడ్డపై జెండా పాతిన టీం ఇండియా

SMTV Desk 2019-01-18 16:25:03  Team India VS Australia 3rd ODI, Melbourne, india won match

మెల్‌బోర్న్, జనవరి 18: భారత్, ఆసిస్ మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు మెల్‌బోర్న్ లో జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత్ సంచలన విజయాన్ని చేజిక్కించుకుంది. ఆసిస్ 48.4 ఓవర్లకే 230 పరుగులు చేసి ఆలౌటయి కోహ్లి సేనకు 231 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది.

చాలా ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని చివరి బంతిని ఫోర్ తో ముగించి వన్డేల సిరీస్ ను సొంతం చేసుకున్నారు. 234/3 తో టీం ఇండియా విజయ బేరిని మ్రోగించింది.