మెల్బోర్న్, జనవరి 18: భారత్ -ఆసిస్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు మెల్బోర్న్ వేదికగా ఆఖరి వన్డే జరుగుగా ఆసిస్ 48.4 ఓవర్లకే 230 పరుగులు చేసి ఆలౌటయ్యంది. షాన్ మార్ష్(39), పీటర్ హాండ్స్కోంబ్(58), ఉస్మాన్ ఖ్వాజా(34) పరుగులు చేశారు. మిగతా వారు అంతగా రాణించలేకపోయారు.
కెప్టెన్ ఫించ్ 14 పరుగులకే భువనేశ్వర్ బౌలింగ్లో డకౌటయ్యాడు. ఛాహల్ 6 వికెట్లు, భువనేశ్వర్ 2 వికెట్లు, షమి వొక వికెట్ తీశారు. ఆసీస్ 231 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందుంచింది.