హైదరాబాద్, జనవరి 17: ఈ రోజు ఉదయం తెలంగాణ అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ పదవికి రేఖ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలి అసెంబ్లీ డిప్యూటి సీకర్ గా పద్మా దేవేందర్ రెడ్డి విధులు నిర్వహించగా ఈ సారి ఈ పదవికి రేఖ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే స్పీకర్, డిప్యూటి స్పీకర్ పదవులకు విపక్షాలు పోటీ చెయ్యక పోవడంతో ఈ పదవులు కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే స్పీకర్ పదవికి పోచారం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన తర్వాత డిప్యూటీ స్పీకర్ పదవికి రేఖా నాయక్ నామినేషన్ ను దాఖలు చేశారు.స్పీకర్ పదవికి పోచారం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసే సమయంలో కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, ఎంఐఎం తరపున బలాల నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు.