హైదరాబాద్, జనవరి 17: గురువారం ఉదయం బాన్సువాడ శాసనసభ్యుడు, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ శాసనసభాపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పోచారం తరపున ఆరు ప్రతిపాదనలు సమర్పించారు. పోచారం పేరును ప్రతిపాదించిన వారిలో సీఎం కేసీఆర్తోపాటు మల్లు భట్టి విక్రమార్క, అహ్మద్ బలాల, సురేఖా నాయక్, అబ్రహం ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పదవికి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే శ్రీ పోచారం శ్రీనివాస్రెడ్డి @PSRTRS అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయంలో నామినేషన్ దాఖలుచేశారు. ఈ కార్యక్రమానికి సీఎం శ్రీ కేసీఆర్తో పాటు విపక్ష నేతలు హాజరయ్యారు. pic.twitter.com/yFCg2XRpV6
— BRS Party (@BRSparty) January 17, 2019
సభాపతిగా పోచారం శ్రీనివాస్రెడ్డి గారి అభ్యర్థిత్వానికి అన్ని పార్టీలు మద్దతు తెలపడంతో ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. కాగా ఈరోజు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకూ సభాపతి అభ్యర్థి కోసం ప్రతిపాదనలు స్వీకరిస్తారు.