శాసనసభాపతిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు

SMTV Desk 2019-01-17 16:09:42  Pocharam srinivas reddy, Nomination

హైదరాబాద్, జనవరి 17: గురువారం ఉదయం బాన్సువాడ శాసనసభ్యుడు, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ శాసనసభాపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పోచారం తరపున ఆరు ప్రతిపాదనలు సమర్పించారు. పోచారం పేరును ప్రతిపాదించిన వారిలో సీఎం కేసీఆర్‌తోపాటు మల్లు భట్టి విక్రమార్క, అహ్మద్‌ బలాల, సురేఖా నాయక్‌, అబ్రహం ఉన్నారు.



సభాపతిగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి గారి అభ్యర్థిత్వానికి అన్ని పార్టీలు మద్దతు తెలపడంతో ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. కాగా ఈరోజు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకూ సభాపతి అభ్యర్థి కోసం ప్రతిపాదనలు స్వీకరిస్తారు.