న్యూఢిల్లీ, జనవరి 17: భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా స్వైన్ ఫ్లూ చికిత్స కోసం బుధవారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ‘నాకు స్వైన్ ఫ్లూ వచ్చింది. చికిత్స జరుగుతోంది. భగవంతుడి దయ, మీ అందరి ఆశీర్వాందంతో త్వరలోనే కోలుకుంటా అని అమిత్ షా హిందీ భాషలో ట్వీట్ చేశారు. బుధవారం రాత్రి ఛాతీ పట్టేయడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో అమిత్ షాను ఆసుపత్రిలో చేర్చినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ అమిత్ షాను ఆసుపత్రిలో పరామర్శించారు.
मुझे स्वाइन फ्लू हुआ है, जिसका उपचार चल रहा है। ईश्वर की कृपा, आप सभी के प्रेम और शुभकामनाओं से शीघ्र ही स्वस्थ हो जाऊंगा।
— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) January 16, 2019