ఈ నెల 15 నుండి అర్థ కుంభమేళ ప్రారంభం

SMTV Desk 2019-01-14 17:36:01  Khunbhamela, Uttarpradesh, Prayagraj

లక్నో, జనవరి 14: ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో రేపటి నుండి అర్థ కుంభమేళ మహాక్రతువు ప్రారంభం కానుంది. ఈ నెల 15 నుంచి మార్చి 4 వరకు ఈ కుంభమేళాకు యుపి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మహాకుంభమేళాకు 15 కోట్ల మంది భక్తలు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చేసింది.





100 హెక్టార్లలో గుడారాలు, విఐపిల కోసం ప్రత్యేత సదుపాయాలు ఏర్పాటు చేశారు. 450 ఏళ్ల కుంభమేళా చరిత్రలో ఈ అవకాశం కల్పించడం ఇదే తొలిసారి. ఇందుకోసం యుపి ప్రభుత్వం రూ. 2,800 కోట్లు ఖర్చు చేసింది. కుంభమేళా పూర్తయ్యే నాటికి రూ. 4,300 కోట్లు వ్యయం కావొచ్చని అంచనా వేశారు.