లక్నో, జనవరి 14: సోమవారం మధ్యాహ్నం ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దిగంబర్ అకాడ శిబిరంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. అగ్నిప్రమాదంతో పలు తాత్కాలిక నిర్మాణాలు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు.