హైదరాబాద్ లో దారుణం...మూడేళ్ళుగా 16 ఏళ్ల బాలికపై అత్యాచారం

SMTV Desk 2019-01-14 11:12:33  Hyderabad, 16 Years girl raped for 3 years, Teen girl raped, Police station, Patabasti

హైదరాబాద్, జనవరి 14: హైదరాబాద్ లోని పాతబస్తీలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. మూడేళ్ళుగా ఓ 16 ఏళ్ల బాలికపై 11 మంది కామందులు గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు. కాగా ఈ ఘోరానికి పాల్పడిన వారిలో ప్రధాన వ్యక్తి ఆ బాలిక సమీప బందువేనని సమాచారం. పూర్తి వివరాల ప్రకారం ఓ ఆయిల్‌ వ్యాపారి తన కుటుంబంతో కలిసి కామాటిపుర ప్రాంతంలో నివసిస్తున్నాడు. రెండేళ్లక్రితం ఓరోజు కుటుంబ సభ్యులు పనికి వెళ్లిన తర్వాత ఆ ఇంట్లో బాలిక వొంటరిగా ఉండడం చూసి సమీప బంధువైన రాజేశ్‌ (25) ఇంట్లోకి వచ్చాడు. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనను వీడియోలో చిత్రీకరించాడు. ఆ వీడియోతో బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమెపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. కొన్నాళ్లకు ఆ వీడియోను స్నేహితులు అభిజిత్‌ కౌశిక్‌, శుభమ్‌ వ్యాస్‌లకు షేర్‌ చేశాడు.





తర్వాత ఆ వీడియో షేరవుతూ 10మందికి చేరింది. వీడియోను బయటపెడతామని బెదిరిస్తూ రాజేశ్‌, అబిజిత్‌, శుభమ్‌తో పాటు మిగతా 8మంది బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారని కుటుంబసభ్యులు డిసెంబరు 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డిసెంబరు 31న రాజేశ్‌, అభిజిత్‌, శుభమ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసుకు సంబంధించి విజయ్‌కుమార్‌ను పోలీసులు సాక్షిగా చేర్చారు. తమ బాధిత కుటుంబసభ్యులు ఆదివారం బస్తీలో, కామాటిపురా పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన నిర్వహించారు. మిగతావారినీ అరెస్ట్‌ చేసి, ఉరితీయాలని వారు డిమాండ్‌ చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. దక్షిణ మండలం అడిషనల్‌ డీసీపీ మహ్మద్‌ రఫీక్‌, మీర్‌చౌక్‌ ఏసీపీబి ఆనంద్‌లు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. నిందితులను 24 గంటల్లో అరెస్ట్‌ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బాధిత బాలిక వాంగూల్మనం నమోదు చేశారు. సాక్షిగా ఉన్న విజయ్‌ కుమార్‌ కూడా తనపై అత్యాచారం జరిపినట్లు బాలిక చెప్పడంతో కేసును సీసీఎ్‌సకు బదిలీ చేసినట్లు సీపీ చెప్పారు.