నెల్లూరు, జనవరి 14: ఏపీలో రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షం పూర్తిగా అంతరించిపోతుందని రాష్ట్ర మంత్రి నారాయణ ఎద్దేవా చేశారు. నెల్లూరు అభివృద్ధిపై సమీక్షించిన ఆయన నగర అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని చెప్పారు.
నెల్లూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి భారీగా నిధులు ఖర్చుచేస్తున్నామన్నారు. ప్రతి ఇంటికి మంచి నీటి కుళాయి కనెక్షన్లు ఇస్తున్నామని తెలిపారు. ఎటువంటి నీటి మీటర్లు, అదనపు పన్ను విధించడంలేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.