కేసీఆర్ కు వెంకయ్య నాయుడు అభినందనలు

SMTV Desk 2019-01-13 19:26:45  Venkaiah nayudu, Swarnabharath trust, Sankranthi celebrations, Central minister Ravi shankar prasad

హైదరాబాద్, జనవరి 13: సంక్రాంతి సందర్భంగా స్వర్నభారత్ ట్రస్ట్ లో నిర్వహించిన వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి రవి శంకర్ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని సూచించారు. రైతులకు ప్రయోజనం కలిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేయాలన్నారు. కళలు, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, సంస్కృతి, భాషకు పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్‌కు వెంకయ్య అభినందనలు తెలిపారు.

రాజకీయాల్లో గంగిరెద్దులు ఎక్కువయ్యాయని, నిజమైన గంగిరెద్దులు తక్కువయ్యాయని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. స్వర్ణభారత్ ట్రస్ట్ వరల్డ్‌క్లాస్‌ ఇనిస్టిట్యూట్‌ అని కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ కొనియాడారు. పేదలు, రైతులు, యువత అభివృద్ధికి వెంకయ్య కృషిచేస్తున్నారని, ప్రభుత్వ సహాయం లేకుండా ట్రస్ట్‌ను నిర్వహించడం అభినందనీయమన్నారు. స్వర్ణభారత్‌ ట్రస్ట్ మిని భారతాన్ని తలపిస్తోందని రవిశంకర్‌ ప్రసాద్‌ చెప్పారు.