న్యూ ఢిల్లీ, జనవరి 13: గత కొద్ది రోజులుగా పెండింగ్ లో ఉన్న నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టుకు అటవీ అనుమతులను తాజాగా కేంద్రం మంజూరు చేసింది. 1016 హెక్టార్ల అటవీ భూమి వినియోగానికి ఎఫ్ఏసీ కమిటీ అనుమతిచ్చింది.
12 ఏళ్ల తర్వాత సోమశిల ప్రాజెక్టు అనుమతులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు పరుగులు పెట్టనున్నాయి. 1971లో ఈ ప్రాజెక్టును ఏపీలోని నెల్లూరు జిల్లా సోమశిల వద్ద పెన్నా నదిపై నిర్మించారు.