అమరావతి, జనవరి 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. మరి కొద్ది రోజుల్లో ఏపీ నూతన రాజధాని అమరావతి నుండి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
ఇప్పటికే గన్నవరం విమానాశ్రయం నుండి సింగపూర్ కు విమాన సర్వీసులు మొదలు కాగా మార్చి నెలాఖరు నుండి దుబాయ్ కి కూడా విమాన సర్వీసులు మొదలు కాబోతున్నాయి. వారానికి రెండు సార్లు దుబాయ్ కు విమాన సర్వీసులు నడపనున్నారు.