కొత్తగూడెం, జనవరి 13: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వైద్యులకు ఆ ప్రాంత కలెక్టర్ రజత్కుమార్ శైనీ షాక్ ఇచ్చారు. ఈ మధ్య జిల్లా కేంద్రంలోని కల్లెక్టరేట్ లో నిర్వహించిన వైద్యారోగ్య శాఖ సమావేశంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని కాంట్రాక్టు వైద్యులను టెర్మినేట్ చెయాలని నిర్ణయం తీసుకున్నారు. అశ్వారావుపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కాంట్రాక్టు వైద్యుడిగా పనిచేస్తున్న మంగీలాల్ను టెర్మినేట్ చేయాలని ఆ శాఖ డీసీహెచ్ఎస్ను ఆదేశించారు.
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తాత్కాలికంగా డిప్యుటేషన్పై వెళ్లిన గైనకాలజిస్టు డాక్టర్ స్వాతి, పాల్వంచ ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్ ముక్కంటేశ్వరావు, కొత్తగూడెం ఏరియా ఆస్పత్రి కాంట్రాక్టు వైద్యురాలు ఐశ్వర్య విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు గాను వారికి షోకాజ్ నోటీసులు అందజేశారు.