శ్రీలంక, జూలై 28 : తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో శ్రీలంక 291 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టపోయి 189 పరుగులు చేసింది. భారత్ బ్యాటింగ్ లో శిఖర్ ధావన్ 14, చటేశ్వర్ పుజార 15 పరుగులు చేసి ఔటయ్యారు. అభినవ్ ముకుంద్ 81, విరాట్ కోహ్లి 76 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 498 పరుగుల లీడ్ లో ఉంది.