మెదక్, జనవరి 11: రానున్న రాష్ట్ర పంచాయతి ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకొంటుంది. గురువారం మేడ్చల్ జిల్లాలోని కలెక్టర్ సమావేశ మందిరంలో ఎన్నికల పరిశీలకులు కిషన్, ఎస్సీ చందన దీప్తి, డీపీఓ హనోక్, డీఆర్వో సీతారామారావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ ధర్మారెడి మాట్లాడుతూ పంచాయతి ఎన్నికల్లో ఎన్నికల్ కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.