హైదరాబాద్, జనవరి 11: థాయ్లాండ్ తో గెలిచి మంచి ఊపులో ఉన్న భారత ఫుట్ బాల్ జట్టుకు హోం టీమ్ అయినా యూఏఈతో 2-0 తేడాతో ఓడిమిపాలైంది. ఈ మ్యాచ్ లో ఆరంభం నుండే యూఏఈ మంచి ప్రదర్శన కనబరచి ఇండియా మీద 2-0 తేడాతో గెలిచి గ్రూప్-ఎ మొదటి స్థానంలో నిలిచింది. చివరివరకు గోల్ గొట్టడానికి పలుమార్లు అవకాశాలు వచ్చినా ప్రయత్నించినా ఫినిషింగ్ లో భారత ఫుటబాల్ జట్టు విఫలమైంది. యూఏఈ ఆటగాళ్లు ఖల్ఫాన్ ముబారక్(41వ నిమిషం), అలీ అహ్మద్ మక్భూత్ (88వ నిమిషం) గోల్స్ కొట్టి జట్టుకు తొలి విజయాన్ని అందించారు. మొదటి నుండి రెండు జట్లకు సమాన అవకాశాలు ఉండగా, యూఏఈ ఆటగాళ్లు పాస్లను చక్కగా అందుకోవడంతో బంతి ఎక్కువ శాతం యూఏఈ ఆధీనంలోనే ఉంది.
ప్రస్తుతం భారత ఫుట్ బాల్ జట్టు 3 పాయింట్లతో గ్రూప్-ఎ లో 2వ స్థానంలో ఉండగా, నాకౌట్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. సోమవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్లో బహ్రెయిన్తో భారత్ గెలిస్తే మొదటి స్థానంలో నిలుస్తుంది. యూఏఈ జట్టు 4 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది.