సామాన్య భక్తులతో కలిసి శ్రీవారి దర్శనం

SMTV Desk 2019-01-10 20:20:56  YS Jagan mohan reddy at tirumala, YSRCP, TTD

తిరుమల, జనవరి 10: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సామాన్య భక్తులతో కలిసి శ్రీవారిని దర్శించుకొన్నారు. పాదయాత్రను ముగించుకొని గురువారం నాడు జగన్ తిరుపతికి చేరుకొన్నారు. మధ్యాహ్నం 1:40 నిమిషాలకు అలిపిరి నుండి తిరుమలకు బయలుదేరారు.

సాయంత్రం 4:40 గంటలకు జగన్ తిరుమల కొండపైకి చేరుకొన్నారు. తిరుమల కొండపై ఉన్న ఓ గెస్ట్‌హౌజ్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకొన్న తర్వాత సామాన్య భక్తుడి మాధిరిగానే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారిని దర్శించుకొన్నారు. జగన్‌కు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు.