మహబూబాబాద్, జనవరి 10: చిన్నగూడురులో ఘోర సంఘటన చోటు చేసుకుంది. మతిస్థిమితం లేని యువతిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల ప్రకారం చిన్నగూడురు మండలం ఉగ్గంపల్లి గ్రామంలో ఓ యువతి కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటుంది. తనకి మతిస్థిమితం లేకపోవడం వల్ల తనని ఎటూ తీసుకెళ్ళకుండా ఇంట్లో వొక్కదాన్నే వొదిలి మిగితా వారు తమ పనులపై బయటికి వెళ్ళినప్పుడు తను ఇంట్లో వొంటరిగా ఉండేది. ఆమె ఆరోగ్యపరిస్థితి, వొంటరితనాన్ని అదునుగా చేసుకుని అదే గ్రామానికి చెందిన కొంపెల్లి వెంకన్న అనే యువకుడు పట్టపగలే అత్యాచారానికి పాల్పడ్డాడు.
తమ కూతురిపై జరిగిన అఘాయిత్యం గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.