స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో మంచి పేరు ఉన్న షివోమి, గత ఏడాది టీవీలను విడుదల చేసింది. అవికూడా మంచి రెస్పాన్స్ రావడంతో, ఇప్పుడు కొత్తగా మరో రెండు టీవీలను ఇండియాలో లాంచ్ చేసింది. ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎక్స్ ప్రో, ఎంఐ టీవీ 4ఏతో పాటు సౌండ్బార్ ను రిలీజ్ చేసింది షివోమి. మిగత బ్రాండ్ టీవీలతో పోల్చుకుంటె ఎంఐ టీవీలను తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్స్ తో అమ్మడంతో వీటికి మంచి డిమాండ్ ఉంది.
ఎంఐ టీవీ 4ఏ ప్రో ధర రూ.22,999. 4ఎక్స్ ప్రో ధర రూ.39,999. జనవరి 15 మధ్యాహ్నం 12 గంటలకు mi.com వెబ్సైట్లో సేల్ మొదలవుతుంది.