మిస్టరీగా మారిన విక్రమ్ హత్య కేసు

SMTV Desk 2017-07-28 15:57:44  vikram goud, death,

హైదరాబాద్, జూలై 28 : ఈ రోజు ఉదయం మంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారన్న విషయం తెలిసిందే. ఈ హత్య కేసు మిస్టరీ గా మారింది. అయితే తాజా సమాచారం ప్రకారం.... విక్రమ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తనను తానే కాల్చుకుని ఆత్మహత్యాయత్నం కు పాల్పడినట్లు తెలుస్తుంది. గత పది రోజులుగా వస్తున్న డ్రగ్స్ వార్తలను విక్రమ్ తన ఫోన్ లో భద్ర పరుచుకున్నాడని, ఇవన్నీ మెసేజ్‌లను విక్రమ్ తన భార్యకు పంపినట్లు అనుమానిస్తున్నారు. విక్రమ్ కు 39 వాట్సప్ మెసేజీలు వచ్చాయని, ఇందులో ప్రతి ఒక్కరికి విక్రమ్ ఇవ్వాల్సిన డబ్బుల గురించి బాధితులు ఈ మెసేజ్‌లు పంపారని పోలీసులు అనుకుంటున్నారు. రూ. 15 లక్షలు, రూ. 20 లక్షలు, రూ. 35 లక్షలు ఇవ్వాలని ప్రతి ఒక్కరు మెసేజ్‌లు పంపినట్లు తెలుస్తుంది. అప్పుల్లో కూరుకుపోవడం, డ్రగ్స్ లింక్స్‌తో సెన్సేషన్ అవడంతో విక్రమ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.