జమ్మూ, జనవరి 10: జమ్మూ కశ్మీర్లో ఈరోజు తెల్లవారుజామున భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూప్రకంపనల 4.6 తీవ్రతతో నమోదయ్యాయి. భూమి కంపిస్తుండటంతో ప్రజలు భయంతో రోడ్డుపైకి పరుగులు పెట్టారు. పలు భవనాల్లోని వస్తువులు కదిలాయని, కొన్ని చోట్ల పాత గోడలు కూలాయని తెలుస్తోంది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టంపై ఇంకా ఎటువంటి వివరాలూ వెల్లడికాలేదు. స్వల్ప భూకంపం సంభవించిన మాట వాస్తవమేనని అధికారులు ప్రకటించారు. దీనిపై మరిన్ని విషయాలు తెలియాల్సివుంది.