జైపూర్, జనవరి 9: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సర్కార్పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్రికెట్ భాషలో నిప్పులు చెరిగారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో జరిగిన సభలో రాహుల్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ బ్యాక్ఫుట్లో ఆడుతున్నారని..రైతులు, యువత ముందుకొచ్చి సిక్సర్లు బాదాలని పిలుపు ఇచ్చారు. రైతులకు వ్యవసాయ క్షేత్రం వద్దే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి వారి పంటలను ఎగుమతి చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. భారత రైతులు ప్రపంచమంతటికీ ఆహారం సరఫరా చేస్తారన్నారు.
జరగబోయే సార్వత్రిక ఎన్నికల తరవాత కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగానే దేశవ్యాప్తంగా రైతు రుణాలను మాపీ చేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ రుణాల మాఫీ రైతులకు ఉపశమనం కలిగిస్తుందని, అయితే ఇది వొక్కటే తుది పరిష్కారం కాదన్నారు. రఫేల్ వొప్పందంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీచే విచారణ జరిపించాలని ఆయన పునురుద్ఘాటించారు. రఫేల్పై పార్లమెంట్లో చర్చ జరిగితే ప్రధాని మోదీ పత్తా లేరని, రెండున్నర గంటలు మాట్లాడిన నిర్మలా సీతారామన్ తాము అడిగిన ఏ ప్రశ్నకూ బదులివ్వలేదని ఆరోపించారు.