'కథానాయకుడు’కి పూర్తి న్యాయం జరిగింది: నారా బ్రాహ్మణి

SMTV Desk 2019-01-09 17:17:02  NTR Biopic, Balakrishna, Krish, Nara Brahmmani

హైదరాబాద్, జనవరి 9: నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన యన్.టి.ఆర్ చిత్రం ఈరోజు విడుదలైంది. ఈ చిత్రాన్ని హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో బాలకృష్ణ, ఆయన కుటుంబసభ్యులు చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాగా, బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి మాట్లాడుతూ, ‘నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నాన్న గారు అచ్చం తాతగారిలా ఉన్నారు. తాతగారు ఎప్పుడూ ప్రజాసేవ గురించి ఆలోచించేవారు, కుటుంబంతో చాలా తక్కువ సమయం గడిపారు. మా నాయనమ్మ బసవతారకం గారు నేను పుట్టకముందే చనిపోయారు.

అయితే, ఆమె ఎంతో గొప్ప వ్యక్తి అని, తాతగారికి ఫిల్మ్ కెరీర్ లోనే కాకుండా పాలిటిక్స్ లో కూడా ఆమె చాలా సపోర్టు చేశారన్నారు. ఈ చిత్రంలో అందరూ బాగా నటించారు. టెక్నీషియన్స్ కష్టపడ్డారు. ఈ చిత్రం హిట్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేసారు. ఈ సినిమా మూవీలా కాకుండా నిజంగా స్టోరీ చూసినట్టు అనిపించింది, నాన్నగారి ప్రొడక్షన్ లో మొదటి సినిమా అయిన దీనికి పూర్తి న్యాయం జరిగింది అని చెప్పారు.