హైదరాబాద్, జనవరి 9: యువ కథానాయకుడు నిఖిల్ కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగ రంగాల్లో కల్పించిన 10 శాతం రిజర్వేషన్లపై స్పందిస్తూ మోదీ నిర్ణయాన్ని అభినందించాడు. కాగా ఇటీవల రానా హోస్ట్గా నిర్వహిస్తున్న ‘నెం.1 యారీ షోలో నిఖిల్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రానా, తాను అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించే విషయమై చర్చించుకున్నట్టు నిఖిల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.
నిఖిల్ తన ట్విట్టర్ ఖాతాలో ‘కొన్ని వారాల క్రితం రానా వ్యాఖ్యాతగా వ్యవహరించే షోలో మేం ఈ రిజర్వేషన్ల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కులం, మతం, జాతి గురించి పట్టించుకోకుండా మోదీ సర్ దీనిని నిజం చేసి అద్భుతమైన పనితీరును కనబరిచారు. జాతి వివక్షకు నో చెప్పండి అని ట్వీట్ చేసాడు.
Spoke about this in Rana's yaari show a few weeks back... and today I see this👏🏼👏🏼...
— Nikhil Siddhartha (@actor_Nikhil) January 8, 2019
Modi sir has done a brilliant job 👍🏼in recognizing that there r economically poor ppl too who need to be taken care of, irrespective of caste, religion or race... #SayNoToRacism @narendramodi pic.twitter.com/p4DR1USQnu